AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురై HYDలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన కుమార్తె అనూష స్పందించారు. ‘మా నాన్న పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. బీపీ ఎక్కువగా ఉండడంతో టెస్టులు చేస్తున్నారు. మండలి అయ్యాక రేపు వెళ్లాలనుకున్నాం కానీ.. నీరసంగా ఉండడంతో ఒకరోజు ముందే హైదరాబాద్ చేరుకున్నాం’ అని తెలిపారు.