KDP: రాయచోటిలో పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. లూజ్ పాలు విక్రయించే అవుట్లెట్ల నుంచి 6 పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. పాలలో కల్తీ నిర్ధారణ అయితే ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.