ATP: రాప్తాడు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రిని ప్రత్యేకంగా కలిసి ఆలయాల పరిస్థితి గురించి చర్చించి, నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.