PLD: గురజాల మండలం దైద అడ్డరోడ్డు వద్ద బైక్పై వెళ్తున్న తేలుకుట్ల గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల ఏడుకొండలపై వైసీపీకి చెందిన నేతలు రాడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరులో చికిత్స పొందుతున్న ఏడుకొండలను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.