AP: నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం చేయాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని తెలిపారు. గంగ-కావేరి అనుసంధానం జరగాలన్నది తన కోరిక అని వెల్లడించారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామన్నారు.