ADB: ఉట్నూర్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డీఈవోగా గోడం చందన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన పార్డీ(బి) గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పీజీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఈ కీలక పోస్టును భర్తీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.