MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మహిళా సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వ్యాయాయంతో నిర్మించనున్న సమావేశ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.