భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 92 పరుగులతో అజేయంగా నిలిచింది. మిగతా బ్యాటర్లలో సునే లూస్ (23) మినహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి, శ్రీ చరణి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీశారు.