NRML: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో షీ టీం కీలక పాత్ర పోషించింది. కుటుంబ వివాదాలతో వచ్చిన వారికి షీ టీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోయిన వారిని తిరిగి కలిపారు. కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు వెళ్లే భారం తప్పించి భైంసాలోనే ఈ సదుపాయం కల్పించడం పట్ల బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.