ప్రకాశం: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు చూడాలని సూచించారు. వాది, ప్రతివాదులకు లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలని ఆమె కోరారు.