KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న సామాజిక ఉద్రిక్తతలకు సంబంధించి నమోదైన కేసులను పునఃసమీక్షించాలని AIMIM జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్ కోరారు. SP రాజేష్ చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో అనేక మంది నిరపరాధులు, మైనర్లు కేసుల్లో ఇరుక్నుని అరెస్టు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని విడుదల చేయాలన్నారు.