E.G: సీతానగరం మండలం ముగ్గుల సబ్స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE నటరాజన్ తెలిపారు. రోడ్డు మరమ్మతుల కారణంగా రఘుదేవపురం, సింగవరం గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.