శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రవి పంటలకు సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగుస్తుందని వ్యవసాయ శాఖ జేడి త్రినాధ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పంట నమోదు తప్పనిసరిగా రైతులు చేసుకోవాలని, ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు పొందాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.