MDCL: మల్కాజ్గిరి పరిధిలో రహదారుల మధ్య సంవత్సరాలుగా మూలకు పడి తుప్పు పట్టిన వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు మల్కాజ్గిరి జోన్లో 39, ఉప్పల్ జోన్లో 40, ఎల్బీనగర్ జోన్లో 10 వాహనాలను తొలగించారు. మొత్తం 89 వాహనాలు స్వాధీనం చేసుకుని ట్రాఫిక్కు ఆటంకం లేకుండా మార్గాలను స్వచ్ఛంగా మార్చారు.