MNCL: వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నామని మంచిర్యాల ట్రాఫిక్ CI సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.