SDPT: సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుండి జారిపడి బశెట్టి రాజు (41) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోవా కట్టెలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. మృతుడు సిద్దిపేట వాసిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.