కోనసీమ: వెలగపూడి సచివాలయంలో మంగళవారం శాసనసభ విరామ సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్ కళ్యాణ్కు వివరించారు. వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.