PPM: జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన పార్వతీపురం మండలం బాగుడభ గ్రామానికి చెందిన అథ్లెట్ గోవింద్కు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అండగా నిలిచారు. ఢిల్లీలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటిన గోవింద్, నేపాల్లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులు ఇలాంటి శిఖరాలను అధిరోహించడం గర్వకారణమని ఆయన కొనియాడారు.