JGL: ధర్మపురిలో ఇస్కాన్ ప్రతినిధుల బృందం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసింది. నరహరి ప్రభు ఆధ్వర్యంలో వచ్చిన బృందం ధర్మపురిలో ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసింది. కృష్ణ భక్తి ప్రచారం, భగవద్గీత శిక్షణ, నిత్య అన్నదానం, గోశాల నిర్వహణ ప్రధాన లక్ష్యాలుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమానంద్, సురనాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.