MNCL: లక్షెట్టీపేట మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న ప్రభుత్వ నర్సరీని స్థానిక ఎంపీడీవో సరోజ సందర్శించారు. మంగళవారం ఆమె తిమ్మాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను తప్పులు రాకుండా చూడాలన్నారు. నర్సరీని సందర్శించి నిర్వాహకులకు సూచనలు చేశారు.