SKLM: హిరమండలంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. గురువారం అంగురు కాలనీల్లో సంచరిస్తున్న కుక్కలు స్థానికులపై దాడి చేశాయి. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. బాధితుల కాళ్లపై తీవ్రంగా గాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.