KRNL: ఎండాకాలంలో కుక్క కాట్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆస్పరిలో డాక్టర్ బాలకృష్ణారెడ్డి సూచించారు. అధిక వేడి వల్ల కుక్కలు దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో శుభ్రంగా కడగాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందాలన్నారు.