కృష్ణా: అవనిగడ్డలో నూతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఈనెల 22వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహంలో ఆయనను కమిటీ పెద్దలు ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం పలికారు.