GNTR: పాతగుంటూరు నందివెలుగు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట అడ్డాపై సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు 11 మంది జూదగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి దగ్గర రూ. 80వేల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.