కర్నూలులోని ఆర్.ఆర్. లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాల ప్రోత్సాహం కోసం కల్చరల్, ఆటల పోటీలు నిర్వహించారు. ఇవాళ ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు రవి, దాత వేదవ్యాసచార్ నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికలు, అలాగే క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.