సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నేర ప్రవృత్తి గల వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కదిరిలో గొడవలకు పాల్పడుతున్న నలుగురు యువకులను గుర్తించి, వారి నుంచి రూ.5 లక్షల చొప్పున బాండ్లను తహశీల్దార్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. బైండ్ ఓవర్ అయిన వారు భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్పోర్ట్ ఎన్ఓసీ పొందడం కష్టమవుతుందని పోలీసులు హెచ్చరించారు.