ADB: ఉట్నూరు మండలంలోని షాంపూర్ రోడ్డు ప్రమాద బాధితులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో మాట్లాడి బాధితులకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు.