CTR: చిత్తూరు కలెక్టర్ కార్యాలయ సమీపంలోని కాఫీ దుకాణం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసుల వివరాల మేరకు.. పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ (28) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. పోలీసులు వెంటనే స్పందించి 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.