BDK: ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఎంపికలు పూర్తయ్యాయి. కిన్నెరసాని, కచేనపల్లి మైదానాల్లో నిర్వహించిన బ్యాటరీ టెస్టుల ద్వారా మొత్తం 80 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ బుధవారం తెలిపారు. 105 మంది బాలుర నుంచి 40 మందిని, 72 మంది బాలికల నుంచి 40 మందిని ఎంపిక చేసి ప్రవేశాలు కల్పించారు.