AKP: రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 25 సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. రాత్రి వేళలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ కోసం వెంకటాపురం జంక్షన్ నుంచి NAOB వరకు వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వాహన చోదకులు పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు.