GNTR: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్స్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యను పునర్నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లాలో తెనాలి మున్సిపాలిటీలో ఉన్న 40 వార్డులను 52కి పెంచింది. పెరుగుతున్న జనాభా, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా స్థానిక ఎన్నికలు ఇకపై 52 వార్డుల ఆధారంగా నిర్వహించబడతాయి.