SKLM: ఎచ్చెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడిగా బెండు మల్లేశ్వరరావు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పగుచ్చాలను ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో మండలంలో అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు.