TG: నిజామాబాద్లో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు బలి అయ్యారు. ఇంట్లో ఉరి వేసుకుని శ్రీనివాస్, మమత ఆత్మహత్య చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే, వడ్డీ వ్యాపారుల వేధింపులపై వారు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.