JN: జఫర్గడ్ మండలంలోని సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటకు ఉపయోగించే సామాన్లను, సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం పరిశుభ్రంగా ఉండాలని, పోషకాహారం అందించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారి దృష్టికి తీసుకురావాలన్నారు. వారితో జిల్లా అధికారులున్నారు.