బ్రేక్ ఫాస్ట్ (Breakfast) చేద్దామని ఓ వ్యక్తి హొటల్కు వెళ్లాడు. అయితే దోశ తీసుకున్న కమస్టర్కు హొటల్ సిబ్బంది సాంబర్ ఇవ్వలేదు హర్ట్ అయిన కస్టమర్ కోర్టులో కేసు వేశాడు. బీహార్ (Bihar) లోని బక్సర్ కు చెందిన మనీశ్ గుప్తా అనే లాయర్ తన బర్త్ డే రోజున మంచి దోశ తిందామని దగ్గర్లోని నమక్ అనే రెస్టారెంట్ (Restaurant) కు వెళ్లాడు. అక్కడ రూ.140 కు దోశ పార్సెల్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి పార్సెల్ ఓపెన్ చేసి చూస్తే అందులో సాంబార్ లేదు. దీంతో ఆగ్రహానికి గురైన మనీశ్ (Manish)హొటల్ సిబ్బందిని నిలదీశాడు.
అయితే వాళ్లు సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన కన్స్యూమర్ కోర్టు(Consumer Court)కెక్కాడు.దీంతో కేసు విచారించిన కోర్టు.. రెస్టారెంట్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్ సిబ్బంది వల్ల కస్టమర్ మానసికంగా, ఆర్థికంగా చాలా వేదనకు గురయ్యాడని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే కస్టమర్ కు రూ.3,500 ఫైన్ (Fine) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అపరాధ రుసుము చెల్లించేందుకు కోర్టు 45 రోజుల గడువు ఇచ్చింది. ఒకవేళ ఆటైంలోగా చెల్లించకపోతే 8 శాతం మిత్తితో కలిపి మొత్తం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది(Court judgment). కాగా ఈ ఘటన 2022 ఆగస్టు 15న చోటు చేసుకోగా తుది తీర్పును కోర్టు తాజాగా వెలువరించింది.