MHBD: తొర్రూరు మండలంలోని జమస్తాన్ పురం శివారు సుందర్ నాయక్ తండాకు చెందిన నేతావత్ రవి అనే వ్యక్తి నిన్న పాడి గేదెలకు నీళ్లు తాగించేందుకు ఆకేరు వాగు వద్దకు తోలుకెళ్లగా, ప్రమాదవశాత్తు అదే వాగు గుంతలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. వారి మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.