MHBD: మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన బీగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రాష్ట్ర సవింధాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు రెడ్యాల గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.
NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జానకిరామ్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
WGL: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో WGL కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకం సాధించారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికార బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్లకు బంగారు పతకం సాధించారు.
BHPL: టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిక్కినేని సంపత్ రావు తండ్రి బిక్కినేని మేటల్ రావు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి నిన్న రాత్రి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
WGL: రాయపర్తి మండలం మైలారం శివారులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను అరికట్టాలని శనివారం గ్రామస్థులు సర్పంచ్ చిర్ర వేణుకు వినతిపత్రం సమర్పించారు. ఈ దందా కారణంగా గ్రామ యువత దారితప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
HYD: పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్పై టీజీ-రెరా కఠిన చర్యలు తీసుకుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే బ్లాకులను విక్రయానికి పెట్టినందుకు సదరు ప్రమోటర్పై రూ. 43.71 లక్షల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే నిర్మాణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.
NZB: 2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
SDPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 17వ తేదీన రైతుబంధు విడుదల చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని, 20వ తేదీ వచ్చినా ఇప్పటికీ నిధులు జమ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడా?, కోతల సమయంలోనా? ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదని, ఈసారి అయినా విడుదల చేస్తారా? అని నిలదీశారు.
KNR: కరీంనగర్లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.
SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.
NLG: జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మామిడాలలో అప్పుల బాధతో సంతోష్ ఉరివేసుకోగా, తిట్టకుంటలో మానసిక స్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేష్ గడ్డిమందు తాగి మృతి చెందాడు.
RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం మత సామరస్యాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మసీదు అభివృద్ధి కోసం ఆయన రూ. 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మైనార్టీ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ADB: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ నూతన ఛైర్మన్గా ఎన్నికైన ఆమెను సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
NZB: మక్తల్లో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు కోచ్గా పండు రాథోడ్ నియమితులయ్యారు. పండు రాథోడ్ ప్రస్తుతం కాకతీయ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా జట్టు రాణించేలా ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పండు రాథోడ్ను పాఠశాల యాజమాన్యం అభినందించినారు.
SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కట్కామ్ మల్లేశం సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే రూ. 5016ల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలకు రూ. 5016ల చొప్పున ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు.