• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

RTC డిపో మేనేజర్‌కు వినతి

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మహేశ్వరంలో ప్రతి బస్స్ హాల్టింగ్ చేయాలని శనివారం కౌన్సిలర్ మృత్ నాయక్, శిరీష రాజు RTC డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలు బస్సు ఆపకపోవడంతో నర్సంపేటకు రావాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి బస్సు హాల్టింగ్ చేయాలని కోరారు.

February 21, 2026 / 09:34 PM IST

‘బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలి’

ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్‌వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

February 21, 2026 / 09:11 PM IST

కల్వ చర్లలో నేత్రదానం

PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మృతి అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.

February 21, 2026 / 09:05 PM IST

రేపు CM పర్యటన.. ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ములుగు జిల్లా కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టును ఆదివారం CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ, RDO వెంకటేష్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను BHPL SP సంకీర్త్ గౌడ్, ఏటూరునాగారం ASP మనన్ భట్ పరవేక్షిస్తున్నారు.

February 21, 2026 / 09:05 PM IST

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే

SRD: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతతో పాటు జీవితానికి దిశానిర్దేశం ఇస్తాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాగలిగిద్ద మండలం ఔదత్ పూర్‌లోని శ్రీ ఎల్లా లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ జాతర మహోత్సవాల్లో మచ్చేందర్ నాథ్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

February 21, 2026 / 08:55 PM IST

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: స్వరూప రాణి

SDPT: ప్రభుత్వ పథకాలకు రాయతీలు లభించాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి సరూప రాణి అన్నారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా, మీసేవ కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పంట బీమా, సబ్సిడీలు అందుతాయన్నారు.

February 21, 2026 / 08:50 PM IST

శాంతినగర్ పెద్ద మసీద్‌లో ఇఫ్తార్ విందు

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పెద్ద మసీద్ మక్బుల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మౌలానా రజాక్ సర్వ మానవాళి సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఉపవాస దీక్షలను విరమించారు.

February 21, 2026 / 08:47 PM IST

పార్టీ కార్యకర్త పాడె మోసిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. శనివారం రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణ భౌతికకాయానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో మంత్రి పాల్గొని చనిపోయిన కార్యకర్త లక్ష్మీనారాయణ పాడెను మోశారు.

February 21, 2026 / 08:46 PM IST

వైద్య చికిత్స నిమిత్తం ఎల్‌వో‌సిని అందజేసిన ఎమ్మెల్యే

RR: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన అశోక్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2,50,000 మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నర్నె శ్రీనివాస్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అందజేశారు.

February 21, 2026 / 08:42 PM IST

ఇసుక ఫిల్టర్‌లపై దాడులు

MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్ శివారు ఇసుక ఫిల్టర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. హల్దీ వాగు పరిసరాలలో అక్రమంగా ఫిల్టర్లను ఏర్పాటు చేసి తీసుకొని తయారు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ దాడులు చేశారు. దాడుల్లో పైపులైన్లు, విద్యుత్ లైన్‌లను ధ్వంసం చేశారు

February 21, 2026 / 08:38 PM IST

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

MLG: ఆకుల వారి గణపురం, భూపాల్ నగర్ గ్రామాలకు చెందిన పలువురు యువత, వివిధ పార్టీల నేతలు నేడు మంత్రి సీతక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 08:36 PM IST

ప్రజావాణి కార్యక్రమం యధాతధం: కలెక్టర్

ADB: ప్రతి సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో యధావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. నమోదైన ప్రతి ఫిర్యాదుపై అధికారులు 30 రోజుల్లోగా పరిష్కార నివేదిక సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

February 21, 2026 / 08:33 PM IST

కొత్త సర్పంచులకు ఎంపీడీవో సూచనలు

SRD: సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్‌లో నూతన సర్పంచులు, కార్యదర్శులకు శనివారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో శారద నూతన సర్పంచులకు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. జీపీ గ్రామసభ, సాధారణ సమావేశం, తీర్మానం, కార్యదర్శిలతో సమన్వయంపై సూచనలు ఇచ్చారు. సంగారెడ్డిలో ఈనెల 23 నుంచి జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులకు సర్పంచులు వెళ్లాలని సూచించారు.

February 21, 2026 / 08:33 PM IST

తెలంగాణ ఉద్యమకారుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: తెలంగాణ ఉద్యమకారుడు మణుగూరు మండల పరిధిలోని 220 కెవి సబ్ స్టేషన్  ప్రాంత నివాసి అక్కినపల్లి సైదులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సైదులు ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను చరవాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు.

February 21, 2026 / 08:31 PM IST

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదు’

HYD: చంచల్ గూడ కేంద్ర కారగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్, ఉప్పల వెంకటేష్ గుప్తా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ పై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

February 21, 2026 / 08:31 PM IST