SRCL: బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం ఏడబ్ల్యూసీలో నూతనంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక నిర్వహించారు. కమిటీ ఛైర్మన్గా సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ మారుతి, వీవో సంధ్య, లావణ్యలచే కమిటీ ఏర్పాటు చేశామని అంగన్వాడి సూపర్వైజర్ నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, అనూజ, తల్లులు, గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.
HNK: పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని మసీదు వద్ద స్ట్రీట్ లైట్లు, కొత్త డ్రైనేజ్ పనులను శనివారం సాయంత్రం నూతన కౌన్సిలర్ పడిదెల దీప్తి-రాకేష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.
MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.
GDWL: కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రోటోకాల్, భద్రతలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు ఉన్న రహదారులను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన హెచ్చరించారు.
NZB: ప్రతీ సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, దీనిని సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు తమకు సమస్యలను పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించి వాటిని పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
KNR: వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడ జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో KNR, HUZ ఆర్డీవోలు, సమావేశమయ్యారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 23న చెస్ మెన్ సౌత్ జోన్ ఎంపికలు, ఆలిండియా తైక్వాండో మెన్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు మార్చి 1-5 వరకు తిరుచిరాపల్లి సౌత్ జోన్ పోటీల్లో, తైక్వాండో క్రీడాకారులు మార్చి 2-6 వరకు జలంధర్లో జరిగే ఆలిండియా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ADB: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు రాందాస్, సంతోష్ రావు, అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
BHPL: రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు వీరునాయక్ -శాంతి కుమార్తె ఉమా – విజేందర్ వివాహ మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.
BDK: జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా శనివారం కొత్తగూడెం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది.
WGL: జిల్లాలో సీఎం, మంత్రుల పర్యటనలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. HNK పట్టణ కేంద్రంలోని BRS కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి 2 రెండేళ్లు గడిచిన ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
MLG: జిల్లా మాజీ DCC అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి మూడవ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కుమారస్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
VKB: వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగిశాయని కుల్కచర్ల ఎంపీడీవో రామకృష్ణ నాయక్ తెలిపారు. గత ఐదు రోజులుగా మండల పరిషత్ కార్యాలయంలో 11 గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు గ్రామ పరిపాలనపై అధికారులు వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. 33 గ్రామ పంచాయతీల గాను మొదటి విడత శిక్షణ తరగతులు ముగిశాయని, మిగతా గ్రామ వార్డు సభ్యులకు త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు.