MDCL: కీసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షుడు కర్రె గణేశ్ ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ గౌడ సంఘం నాయకుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామశాఖ అధ్యక్షుడు తుడుం బాలరాజ్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు చేస్తున్న రైతులు రైతు భరోసా పథకం నిధులు ఇంకా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట వేసే సమయంలో ఎరువులు, విత్తనాలు, కూలీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ పథకం ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుబంధు ఇవ్వాలని కోరారు.
SRD: కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు బోధనాభ్యసన సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యే లా విద్యా బోధన చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించే విధంగా బోధించాలన్నారు.
KMM: బీసీలు అంటే ఎందుకంట చిన్నచూపు ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పి ఇలాంటి దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని రజక సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు జూపల్లి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ చాకలి కులానికి సంబంధించిన పేద కుటుంబం పై దాడిని ఖండించారు.
KMM: పెనుబల్లి మండలం రామచంద్రరావు బజార్ గ్రామంలో నంద్యాల కృష్ణవేణి గోపిలకు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దయానంద్ హాజరయ్యారు. పేదవారికి ఇల్లు అందించడం ముఖ్య లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.
PDPL: ముర్మూర్ కొమరన్న జాతరకు హాజరుకావాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ను జాతర ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకుడు గోపు ఐలయ్య కోరారు. సోమవారం ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయనను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 27 నుంచి మార్చి 3 వరకు మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణోత్సవం జరుగుతుందన్నారు.
NGKL : నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర జాతరలో కులోన్మాదానికి బలైన చిన్నారి ఘటనను నిరసిస్తూ సోమవారం లింగాల మండలం అంబటిపల్లిలో MRPS, రజక సంఘం నాయకులు కుమ్మెర కు బయల్దేరారు. నిందితులను శిక్షించాలని MRPS నేత బంగారయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS కార్యకర్తలు పాల్గొన్నారు.
ADB: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నేరేడిగొండలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 11న గ్రామంలో నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ, మూర్తి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు అనిల్ జాదవ్ అనుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
KNR: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
HYD: సికింద్రాబాద్ రాణిగంజ్లో నకిలీ బేరింగుల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SKF బ్రాండ్ పేరుతో కల్తీ మాల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు మెరుపుదాడులు చేశారు. SV టూల్, బేరింగ్ ఇంటర్నేషనల్ వంటి షాపుల్లో ఏకంగా 1987 నకిలీ బేరింగులు, వేల సంఖ్యలో ప్యాకింగ్ బాక్సులను సీజ్ చేశారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రక్త కళ్యాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
BDK: క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా సాగిస్తున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్వాల విమలాదేవి ఎన్నికయ్యారు. సోమవారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొత్వాలతో పాటు విమలాదేవిని సత్కరించారు.
BDK: ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం గ్రామంలో బొల్ల భవాని నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.
BDK: అశ్వారావుపేటలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో Arrive Alive – Phase 2 కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని ఎస్సై అఖిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.