• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ మధుచంద్

BDK: 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ పాల్వంచ గట్టాయిగూడెం లోని గాయత్రి నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్యం, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 02:34 PM IST

మహిళల్లో క్యాన్సర్ నివారణకు ఉచితంగా వ్యాక్సిన్

HYD: మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తరహాలోనే వీటికి ఉచిత వ్యాక్సిన్ అందించనుంది. గ్రేటర్లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మందికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమీప PHCలలో 6 నెలల వ్యవధిలో మూడు డోసుల టీకాలను ఉచితంగా వేయించుకోవచ్చని అన్నారు.

February 25, 2026 / 02:32 PM IST

చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అందజేసిన ఎస్పీ

SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం ఏర్పాటు చేశారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పోయిన, చోరీకి గురైన సుమారు 6 లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రం లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్లు యజమానులకి అందజేశారు.

February 25, 2026 / 02:30 PM IST

స్వయం స్వపరిపాలన దినోత్సవం

NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. జిల్లా కలెక్టర్‌గా సుహాసిని, జిల్లా విద్యాధికారిగా కృష్ణవేణి, మండల విద్యాధికారిగా శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులుగా నందిని వ్యవహరించారు. బోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం రఘుమోహన్ బహుమతులు ఇచ్చారు.

February 25, 2026 / 02:29 PM IST

బాల్క సుమన్ విడుదల కావాలని పూజలు

MNCL: ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెన్నూర్ BRS నాయకులు పూజలు చేశారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని మదన పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీలైనంత త్వరగా సుమన్‌కు బెయిల్ రావాలని కోరుతూ 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు.

February 25, 2026 / 02:29 PM IST

ఇద్దరు ప్రభుత్వ వైద్యుల తొలగింపు

VKB: విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. కాగా, ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు.

February 25, 2026 / 02:29 PM IST

కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

BHNG: మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి మార్చి 3న నిర్వహించే కళ్యాణ మహోత్సవాలకు ఎమ్మెల్యే మందుల సామెలు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బయ్యాని రాజు, శేఖర, చారి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు

February 25, 2026 / 02:27 PM IST

బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా

NGKL: కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న కుల వివక్ష దాడిలో పసికందు మృతిచెందిన ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున పూర్తి అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడే వరకు పోరాడి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.

February 25, 2026 / 02:27 PM IST

‘స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు’

KNR: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తెలిపారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 27న హకీంపేటలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 02:26 PM IST

చదువుతో సమాజంలో మంచి గుర్తింపు

SDPT: చదువుతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహ నిర్మాణానికి బుధవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం నిర్మాణానికి రూ. 20 వేలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:26 PM IST

రాఘవేంద్ర కాలనీ వీధిలైట్లు వెలిగించటం

GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధి రాఘవేంద్ర కాలనీలో రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ శ్రీరామలింగేశ్వర కాంళ్లే సొంత ఖర్చుతో కొత్త వీధిలైట్లు కొనుగోలు చేసి మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో అమర్చారు. కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

February 25, 2026 / 02:23 PM IST

భూ సర్వేతో ఆస్తి హక్కులకు రక్షణ: కలెక్టర్ హరిత

ASF: ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో బుధవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. భూ సర్వే ద్వారా ప్రతి ఎకరాకు స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులు తమ భూములను చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో భూ తగాదాలు రావని, ఆస్తి హక్కులు భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.

February 25, 2026 / 02:23 PM IST

పాలమూరు యూనివర్సిటీలో ప్రోటోకాల్ రగడ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో బుధవారం ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఫోటో వేసి ఎంపీడీకే అరుణ ఫోటో వేయకపోవడంతో భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

February 25, 2026 / 02:23 PM IST

‘పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి’

MDK: పార్టీలకు అతీతంగా రామాయంపేట అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య సూచించారు. బుధవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు.

February 25, 2026 / 02:22 PM IST

‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం చేగుంట మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

February 25, 2026 / 02:20 PM IST