KMR: ఉప్పల్వాయి – కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద వారం రోజులుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు గురువారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో మూసివేసిన రైల్వే గేట్ను అధికారులు తిరిగి వాహన రాకపోకలకు తెరిచారు. మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు గేట్ పునఃప్రారంభంతో ఊపిరిపీల్చుకున్నారు.
SRD: రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుండడంతో యువకులలో నిరుత్సాహ,నిష్పృశ్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పోవడానికి ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు రంగ సంస్థలు సైతం ముందుకు రావలసిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి, వసతి గృహసముదాయానికి నిధులు ఇవ్వాలని పరిశ్రమ యజమానులను కోరారు.
NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 5 వరకు వైభవంగా జరగనున్నాయి. రేపు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. మార్చి 2న స్వామివారి కళ్యాణం, 3న రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 4న అశ్వ వాహన సేవ, 5న నాగవెల్లి తో వేడుకలు ముగియనున్నాయి. భక్తులు భారీగా తరలిరావాలని ఆలయ కమిటీ కోరింది.
NLG: నార్కట్పల్లిలో దుకాణాల మీదికి దూసుకెళ్లిన లారీ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇరువురికి గాయాలు అయ్యాయి. బండల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో మాండ్రగామానికి చెందిన మేడి కృష్ణ లారీ కింద పడి మృతి చెందాడు. డ్రైవర్ను క్యాబిన్లో ఇరుక్కోగా పోలీసులు బయటికి తీశారు. పండ్ల వ్యాపారి గౌస్కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
MDK: ఇటీవల ఓ భూ వ్యవహారంలో కోర్టు శిక్ష పడిన వారం రోజులకే మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితం మెదక్ కలెక్టర్గా ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్గా అనేక అంశాల్లో తన మార్క్ చూయించారు. ఇటీవల చేగుంట మండలం బోనాలకు చెందిన భూ వ్యవహారంలో హైకోర్టు ఆరునెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీవ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ను సందర్శిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జీఐ టెక్నాలజీతో రూపొందించిన 6 బస్సులను గవర్నర్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి MGBSలో ప్రారంభిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
NRPT: మార్చి 14 న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల మార్చి 28 కి వాయిదా వేసినట్లు సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా కోర్టులో పోలీస్, ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులను నిరసిస్తూ జప్తినాచారంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో DSP నేత శ్రీకాంత్,గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో గురువారం రాణాదివ్వే నగర్ కాలనీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ కోరారు.
KNR: మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు పర్వం కొనసాగుతున్న వేళ.. పాతతరం విప్లవకారుడు దేవరకొండ సత్యనారాయణ అలియాస్ ‘బుక్క సత్తన్న’ ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకి చెందిన సత్తన్న, తండ్రి మరణం తర్వాత తల్లితో HZB మండలం చెల్పూర్ చేరారు. ఈ క్రమంలో PDPLలో ITI చదివి, 1975లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియలేదు.
HYD: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFRC) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన ఎండీ.నూరమ్మ వద్ద సుమారు నాలుగు లీటర్ల గుడుంబా లభ్యమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్కోట్-మహబూబ్ నగర్)ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి.మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులకు తెలిపారు.
KMM: భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తిస్తున్నామని, అసలైన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. భూదాన్ స్థలాన్ని మోసపూరితంగా అమ్మినవారు జైల్లో ఉంటారని తెలిపారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నిన్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో దామోదర్ రావు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో రామయ్యకు ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.