నిజామాబాద్ గోల్ హనుమాన్ శ్రీ జెండా బాలాజీ మందిరాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో జీ. వేణు వెల్లడించారు.
JN: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జనగామ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రతాపరెడ్డి, పలువురు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలిశారు. జనగామ పట్టణ అభివృద్ధికి సహకరించాలని, జనగామ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. అనంతరం కౌన్సిలర్లను మంత్రి సన్మానించారు.
NRPT: మక్తల్ పట్టణంలోని ఒక జ్యువెలర్స్ షాప్ నుంచి వివాహ కార్యక్రమం నిమిత్తం ఒక జత బంగారు కమ్మలు, ఒక బంగారు ముక్కుపుడక, ఒక జత వెండి మట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆభరణాలు ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి అందజేశారు.
NLG: జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
MDK: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దామోదర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. హోలీ రంగుల్లా ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకున్నారు. రాష్ట్రం శాంతి, అభివృద్ధి, సౌభాగ్య మార్గంలో మరింత ముందుకు సాగాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
MNCL: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం సమితి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యుద్ధానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని ఆయన కోరారు.
NGKL: ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషనను రద్దు చేయాలని, ఎర్రవల్లి గ్రామంతో పాటు తండాలను ముంపు నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 92వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో వచ్చే వరకు తమ నిరసనలు ఆపేది లేదని బాధితులు తెగేసి చెప్పారు. ఈ దీక్షలో ఎర్రవల్లి, తండా ప్రజలు పాల్గొన్నారు.
KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ భూములను అక్రమంగా విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. OPDR భూదాన్ కమిటీ పేరుతో అమాయక ప్రజలకు ప్రభుత్వ భూములను పంచుతామని నమ్మించి, ఒక్కొక్కరి నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
BDK: చుంచుపల్లి ప్రశాంత్ నగర్ పంచాయతీ పరిధిలో భవివాదం చిలికి చిలికి గాలివానలా మారి హత్యాయత్నానికి దారితీసింది. హక్కుపత్రాలున్న యజమానిని బెదిరించడమే కాకుండా, పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో టూటౌన్ సీఐ డి. ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ దందాలకు పాల్పడితే సహించేది లేదని వారు అన్నారు.
ASF: వాంకిడి మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతన వార్డు సభ్యులకు ఈనెల 4వ తేదీ నుంచి 5రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు MPDO పాటిల్ జ్యోత్స్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. విధులు, బాధ్యతలు, అభివృద్ధిలో సభ్యుల పాత్ర అనే అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వార్డు సభ్యులందరూ ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
MNCL: లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ అన్నారు. మంగళవారం వార్డులోని పలు కాలనీలలో అనే పర్యటించారు. ఈ సందర్భంగా స్తంభాలకు నిరుపయోగంగా వున్న వెలగని దీపాలను మున్సిపాలిటీ సిబ్బందితో తీసివేయించి నూతన విద్యుత్ దీపాలను అమర్చారు. వార్డులో సమస్యలు ఉంటే తనకు తెలపాలన్నారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ 14వ డివిజన్ చింతకుంట వాసుల ఏళ్లనాటి కష్టానికి తెరపడింది. శ్మశానవాటిక సమీపంలోని డంప్ యార్డు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ గుర్తించారు. ఇచ్చిన హామీ మేరకు అధికారులతో కలిసి ఇవాళ పర్యవేక్షించి, యార్డును అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ADB: అడవుల, వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత అని ఇచ్చోడ FRO నాగవత్ స్వామి అన్నారు. సిరికొండ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతు.. అభయారణ్యం విశిష్ఠత గురించి ప్రజలకు, విద్యార్థులకు వివరించారు. అడవులు వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని FRO నాగవత్ స్వామి వెల్లడించారు. కార్యక్రమంలో FSOలు చంద్రరెడ్డి, తదితరులు ఉన్నారు.
BHNG: తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు, ఆస్తి పంచుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నా, తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. గతంలో కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో, బాధితులు నిన్న ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు.
NGKL: కందనూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి నెల సదరం శిబిరాల తేదీలను డీఆర్డీవో చిన్న ఓబులేసు ప్రకటించారు. శారీరక దివ్యాంగులకు 6, 10, 13, 17, 20, 24, 31 తేదీలో, వినికిడి లోపానికి 5, 25, కంటిచూపు లోపానికి 09, 24, మానసిక వైకల్యానికి 11, 18, తలసేమియా బాధితులకు 30న శిబిరాలు నిర్వహిస్తారు.