NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నిరసిస్తూ.. బీజేపీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా చిట్యాల పోలీసులు ఇవాళ స్థానిక నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. 6 గ్యారెంటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి హామీలను రేవంత్ సర్కార్ విస్మరించిందని జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ళ శ్రీను విమర్శించారు.
NZB: సిరికొండ మండలంలోని బీజేపీ నాయకులను పోలీసులు ఆదివారం అర్థరాత్రి ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం కలెక్టర్ ముట్టడి నేపథ్యంలో అరెస్టు చేశారు. శాంతి యుతంగా ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేసడం పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.
KMR: రాజంపేట మండలంలో పదో తరగతి పరీక్షలను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. తెలుగు, హిందీ పరీక్షలు ముగిసిన అనంతరం పదో తరగతి పరీక్షా పత్రాల వ్యవహారంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఒక తీరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో తీరు వ్యవహరిస్తున్నారన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
KNR: హుజూరాబాద్ మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఇంగ్లీష్ పరీక్ష మండలంలో 821 మంది హాజరుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 291, గురుకులాల నుంచి 235, ప్రైవేట్ పాఠశాలల నుంచి 295 మంది ఉన్నారు. ఉ.9:30-12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పట్టణంలో 3 పరీక్ష కేంద్రాలు, చెల్పూర్ ZPHSలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు MEO తెలిపారు.
BHPL: రాష్ట్ర BJP అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన గోరికొత్తపల్లి BJP నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండల అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్ట్లు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో బాబురావు, వేణు ఉన్నారు.
MHBD: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇవాళ తెల్లవారుజామున తొర్రూరు బీజేపీ శ్రేణులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
MLG: ములుగు మండలం ఇంచర్ల గట్టమ్మ వద్ద రామప్ప ప్రాంత సుస్థిర పర్యాటక సర్క్యూట్లో భాగంగా నిర్మిస్తున్న టూరిజం విలేజ్ పనులను ఆదివారం సాయంత్రం మంత్రి దనసరి సీతక్క పరిశీలించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ దివాకర్ టిఎస్, DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.
NLG: భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధం చేసిన సహజ గోటి తలంబ్రాలను మహిళా భక్తులు దేవస్థాన అధికారులకు ఇవాళ అందజేశారు. జిల్లాలోని వివిధ ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ఒలిచిన ఈ తలంబ్రాలను హిందూ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు ఉమా భారతి, సభ్యులు కలిసి భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. స్వామివారి కళ్యాణంలో ఈ తలంబ్రాలను ఉపయోగించనున్నారు.
SRD: పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ ప్రాంతానికి చెందిన ప్రియ భరతనాట్యంలో అద్భుతం ప్రదర్శన చేసింది. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో కళా సంధ్య వీకెండ్ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బీరంగూడకు చెందిన ప్రియా ఆమె సహచరులు కలిసి నాట్యం ప్రదర్శించారు. ఈమె నాట్యకళను నిర్వాహకులు ఆమెను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.
గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో మునిగి మృతి చెందాడు. రాత్రి వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బావి వద్దకు వెళ్ళి గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భద్రాద్రి జిల్లాలో యాసంగిలో 23 మండలాల్లోని 963 గ్రామాలకు చెందిన 1,91,092 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమకానుంది. ఈ మేరకు జిల్లాకు రూ. 337.17 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2000 మందికిపైగా రైతులు కొత్తగా రైతు భరోసా కోసం నమోదు చేసుకున్నారు. ఇంకా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనున్నారు.
SRCL: గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు పద్మ నర్సాగౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జడ్పీటీసీ మల్లు నర్సాగౌడ్ సతీమణి అయిన పద్మ ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ అత్యధిగా మెజారిటీతో గెలుపొందారు. సంగీతం శ్రీనివాస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
SDPT: రైతులు పంటమార్పిడి చేసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ ఉపయోగించుకోవాలని, రైతులు వరి పంట నుంచి ఆయిల్ పామ్కు మారాలని, ఆయిల్ పామ్లో మూడేళ్లు అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు.
WNP: బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీ. అరవింద్ స్వామి నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, సామాజిక సమస్యలపై పోరాడుతారని సభ్యులు ఆకాంక్షించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. జిల్లా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్వయంగా కలెక్టరేట్కు వచ్చి లిఖితపూర్వకంగా ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.