• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జనగణన–2027 శిక్షణ కేంద్రం ప్రారంభించిన కలెక్టర్

WGL: మామునూరు మండలలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన–2027 శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గణాంకాల సేకరణ ఖచ్చితంగా జరగాలని తెలిపారు. ప్రతి వివరాన్ని బాధ్యతగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ కట్టుబాటుతో పనిచేయాలని తెలిపారు.

March 23, 2026 / 07:34 AM IST

‘CMRF పేద ప్రజలకు వరం’

PDPL: రామగుండం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 50వ డివిజన్ లబ్ధిదారులకు కార్పొరేటర్ సతీష్, మనాలి ఠాకూర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేద ప్రజలకు CMRF వరంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 23, 2026 / 07:25 AM IST

జిల్లాలో మూడు నెలల రేషన్ ఒకేసారి!

NZB: ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతినెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు. నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నరు.

March 23, 2026 / 07:25 AM IST

‘గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం’

MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని రాజీవ్ కాలనీలో రూ.35 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, SP, DFO, మార్కెట్ చైర్మన్ తదితరులు ఉన్నారు.

March 23, 2026 / 07:24 AM IST

‘స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

MNCL: SC 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 07:19 AM IST

BJP నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

MNCL: బెల్లంపల్లికి చెందిన పలువురు BJP నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త చర్యగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం సమంజసం కాదని నాయకులు అన్నారు.

March 23, 2026 / 07:18 AM IST

ఇల్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు

SDPT: చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన తుంగ పోషవ్వ ఇల్లు శిథిలావస్థకు చేరి ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పెంకుటిల్లు కూలిపోవడంతో అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకుంది. వృద్ధాప్యంతో ఉన్న పోషవ్వ ఏ పని చేయలేక పింఛనుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇల్లు కూలిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యింది. అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది.

March 23, 2026 / 07:14 AM IST

భూభారతి ద్వారా సమస్యలు పరిష్కారం: మంత్రి

KMM: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సాదా బైనామా భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాబోయే కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపుతామని నిన్న ఆయన వెల్లడించారు. కొత్తగా తీసుకురానున్న ‘భూభారతి’ ద్వారా అన్ని త్రికాల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

March 23, 2026 / 07:07 AM IST

షార్ట్ సర్క్యూట్.. రెండు పూరిళ్లు దగ్ధం

BDK: దుమ్ముగూడెం మండలం ప్రగల్లపల్లి పంచాయతీ రామచంద్రాపురంలో నిన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పర్సకా వెంకటమ్మ, కల్లూరి బుచ్చమ్మలకు చెందిన తాటాకు ఇళ్లులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 7గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేస్తుండగానే పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.

March 23, 2026 / 07:03 AM IST

జిల్లాలో తొలి విడత రూ.145 కోట్లు జమ

SRPT: తొలి విడతకు గాను రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి ట్రెజరీలకు చేరాయి. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడత సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2,84,332 మంది రైతుల ఖాతాల్లో రూ.145 కోట్లు జమ కానున్నాయి. ఎకరా లోపు రైతులకు తొలి విడతలో బ్యాంకుల ద్వారా నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని.

March 23, 2026 / 07:03 AM IST

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛైర్మన్

WGL: నర్సంపేట డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛైర్మన్ పిండం లక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. అనంతరం ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

March 23, 2026 / 07:02 AM IST

భిక్కనూర్ హైవేపై రోడ్డు ప్రమాదం

KMR: బిక్కనూర్ శివారులో హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. జీఎంఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

March 23, 2026 / 07:01 AM IST

నేటి నుంచి కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

వనపర్తి మండలం పెద్దగూడెంలో నేటి నుంచి 28 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని అర్చకుడు రామన్ స్వామి తెలిపారు. 25న సీతారాముల కళ్యాణం, 27న రథోత్సవం, 28న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

March 23, 2026 / 07:01 AM IST

బైక్ ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు.!

NLG: హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న సాయి అనే యువకుడు కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరమణి, నాగాచారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 23, 2026 / 07:01 AM IST

భద్రగిరి మార్ట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, పీవో

BDK: భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు, ఆ వస్తువుల గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించడం మంచిదని ఎమ్మెల్యే తెల్లం అన్నారు. భద్రాచలంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్‌ను నిన్న రాత్రి ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పరిశీలించారు.

March 23, 2026 / 06:50 AM IST