WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాకతీయ యూనివర్సిటీ వీసీ కర్నాటి ప్రతాపరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ, వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యా రంగం, శాంతి భద్రతలు వంటి పలు అంశాలపై వీరు చర్చించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
WGL: నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, వరంగల్ జిల్లా ప్రజలు ముఖ్యమైన అభివృద్ధి పనుల కోసం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మామునూరు విమానాశ్రయ అభివృద్ధి, ORR (ఒరే రింగ్ రోడ్డు) మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
HYD: అంతరాష్ట్ర పిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. 10 మంది పసి పిల్లలను ముఠా చెర నుంచి రక్షించారు. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు ముఠాలో కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన ముఠాకి, ఈ ముఠాకి సంబంధాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
MBNR: తొర్రూరు మండలం వెలికట్టే శివారులో మంగళవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెలికట్టే శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని, లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామన్నారు.
HNK: గోవాలో ఐదు రోజులపాటు జరిగే నలభై ఏడవ భారత మాస్టర్స్ (వెటరన్) నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు హనుమకొండ జేఎన్ఐఎస్ నుండి 18 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనేందుకు నేడు వెళ్లారు. టీబిఏ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో షటిల్ క్రీడాకారులు ఉత్సాహంగా హనుమకొండ నుండి గోవా బయలుదేరారు.
BDK: ఏప్రిల్ 6న శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నట్లు బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ పేర్కొన్నారు.
జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు.
KMM: తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఖమ్మం నగరంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఉద్యమకారుల గురించి ప్రస్తావించిన సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలిపారు.
WGL: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వరంగల్ పరిధిలోని మండిబజార్ ప్రాంతంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజల రద్దీ అధికంగా ఉండటంతో పాటు శాంతి భద్రతలో భాగంగా ఏసీపీ స్థాయి పోలీస్ అధికారులు, స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసులు ఈ ప్రాంతంలో పహారా కాస్తున్నారు.
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ హై స్కూల్లో అటెండర్గా పని చేస్తున్న బండి రాకేష్ విద్యార్థితో కలిసి మంగళవారం పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తూన్న ఫోటోలు డిఈఓ జనార్ధనరావు దృష్టికి వెళ్లాయి. దీంతో స్పందించిన డీఈవో పాఠశాల హెచ్ఎం జితేందర్తో మాట్లాడి అటెండర్ను తొలగించాలని మౌఖికంగా ఆదేశించడంతో, అటెండర్ను విధులనుండి తొలగించినట్లు హెచ్ఎం తెలిపారు .
MNCL: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 40 మందికి కారుణ్య నియామక పత్రాలను ఏరియా జీఎం దేవేందర్ అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు 1972 మందికి కారుణ్య నియామకల ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని ఆయన సూచించారు.
BDK: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో నేడు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నారు. తలకొండపల్లి మండలంలోని రామకృష్ణాపురం, దేవుని పడకల్ గ్రామాల్లో సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రభలు తిప్పుట కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు డోకూర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
HYD: హైదరగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: ఆరుగాలం పండించి పంట అమ్ముకోవడానికి వచ్చే రైతులకు మున్సిపల్ అధికారులు భోజనం అందుబాటులో పెట్టారు. హరే రామ హరే కృష్ణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో రూ.5కు భోజనం అందుబాటులో పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి యార్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి భోజనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.