KMR: బాన్సువాడ మండలంలో 15 గ్రామపంచాయతీలో ఇవాళ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే గ్రామాలలో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో కొన్ని గ్రామాల్లో ఉదయం నుంచే ఓటు వేయడానికి ఓటర్లు రాగా, మరికొన్ని గ్రామాల్లో చలికి భయపడి ఒకరు ఇద్దరు తప్పించి పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. చలి ఎఫెక్ట్తో ఆ గ్రామాల్లో 8 దాటుతున్న ఆ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాలేకపోతున్నారు.
KMM: జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
HYD: మూసి నదికి సంబంధించి రవాణా ఆధారిత అభివృద్ధి గ్రీన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి, వివిధ అంశాలు పొందుపరిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా HYD మూసి నదిపై 15 వంతెనల నిర్మాణం జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈస్ట్ నుంచి వెస్ట్ నది తీరాన్ని కలుపుతూ 35 నుంచి 40 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ట్రాన్స్ పోర్ట్ డిపెండెంట్ డెవలప్మెంట్ చేయనున్నట్లు సమాచారం.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. యాసంగి పంట సాగు కోసం నీటి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, 16.935 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
NGKL: జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లిలో 12.2°C, కొండారెడ్డిపల్లి 13.3°C, యంగంపల్లి, తెలకపల్లి 13.5°C, బొల్లంపల్లి 13.7°C, సిర్సనగండ్ల 13.9, వెల్దండ 14.0°C, పదర 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ నాగన్న గౌడ్, అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని పుష్పలీల నాగయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు.
MBNR: జిల్లాలోని జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్, అడ్డాకల్, మూసాపేట్ మండలాల్లో గ్రామ పంచాయతీ తుది విడత ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ఐదు మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీలకు 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1249 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
MDCL: ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య కనీసం 30 నిమిషాల పాటు ఎండలో ఉన్నట్లయితే ఆరోగ్యానికి మంచిదని, డీ విటమిన్ సైతం అందుతుందని ఉప్పల్ PHC డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ HYD మహానగరంలో అనేక మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లుగా ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఈ సూచనలు చేశారు.
BDK: అశ్వాపురం మండలం రామచంద్రపురం వద్ద మంగళవారం రాత్రి భద్రాచలం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురై హడావుడిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్, బస్సును రోడ్డుపక్కన ఆపాడు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
SRPT: నడిగూడెం మండలం సిరిపురం కోదండ రామస్వామి దేవాలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభించారు. పూజారి చక్రధరాచార్యులు అమ్మవారికి అలంకరణ, అభిషేకం, పారాయణం, నైవేద్యం సమర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పి మహేందర్ సందర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు పరిశీలించి తగు సూచనలు చేశారు. ఓటు వేసేందుకు విచ్చేసిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రశాంతంగా ఓటును వినియోగించుకునే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
MDK: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామపంచాయతీ చివరి దశ ఎన్నికల సందర్భంగా రెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.
SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న గ్రామపంచాయతీ ఆవరణంలో పోలింగ్ మందకోడిగా సాగుతుంది. ఉదయం 8 గంటలు దాటినా ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడంలేదని అధికారులు తెలిపారు. ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావాలని వారు కోరారు.
HYD: నగరంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 19న జాతీయ సదస్సు జరగనుంది. ‘దక్షిణ భారతదేశ భాషలు-గుర్తింపు రాజకీయాలు’ అనే పేరుతో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో మేధావులు, పరిశోధకులు, జర్నలిస్టులు పాల్గొననున్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హాజరుకానున్నారు.
KNR: 2 డిపో ఆధ్వర్యంలో ఉడిపి, గోకర్ణ, గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డీఎం. ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్యాకేజీలో హంపి, శృంగేరి, ఉడిపి, గోకర్ణ ఆలయాలు దర్శించుకుని డిసెంబర్ 31న గోవా చేరుకుంటారు. డిసెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ నుంచి బస్సు బయలుదేరి, జనవరి 2న తిరిగి చేరుకుంటుంది. పెద్దలకు రూ. 5,500, పిల్లలకు రూ. 4,200 ధరగా ప్రకటించారు.