MNCL: SC 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MNCL: బెల్లంపల్లికి చెందిన పలువురు BJP నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త చర్యగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం సమంజసం కాదని నాయకులు అన్నారు.
SDPT: చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన తుంగ పోషవ్వ ఇల్లు శిథిలావస్థకు చేరి ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పెంకుటిల్లు కూలిపోవడంతో అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకుంది. వృద్ధాప్యంతో ఉన్న పోషవ్వ ఏ పని చేయలేక పింఛనుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇల్లు కూలిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యింది. అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది.
KMM: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సాదా బైనామా భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాబోయే కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపుతామని నిన్న ఆయన వెల్లడించారు. కొత్తగా తీసుకురానున్న ‘భూభారతి’ ద్వారా అన్ని త్రికాల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
BDK: దుమ్ముగూడెం మండలం ప్రగల్లపల్లి పంచాయతీ రామచంద్రాపురంలో నిన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పర్సకా వెంకటమ్మ, కల్లూరి బుచ్చమ్మలకు చెందిన తాటాకు ఇళ్లులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 7గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేస్తుండగానే పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
SRPT: తొలి విడతకు గాను రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి ట్రెజరీలకు చేరాయి. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడత సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2,84,332 మంది రైతుల ఖాతాల్లో రూ.145 కోట్లు జమ కానున్నాయి. ఎకరా లోపు రైతులకు తొలి విడతలో బ్యాంకుల ద్వారా నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని.
WGL: నర్సంపేట డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛైర్మన్ పిండం లక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. అనంతరం ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
KMR: బిక్కనూర్ శివారులో హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. జీఎంఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
వనపర్తి మండలం పెద్దగూడెంలో నేటి నుంచి 28 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని అర్చకుడు రామన్ స్వామి తెలిపారు. 25న సీతారాముల కళ్యాణం, 27న రథోత్సవం, 28న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
NLG: హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న సాయి అనే యువకుడు కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరమణి, నాగాచారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
BDK: భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు, ఆ వస్తువుల గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించడం మంచిదని ఎమ్మెల్యే తెల్లం అన్నారు. భద్రాచలంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ను నిన్న రాత్రి ఐటీడీఏ పీవో రాహుల్తో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పరిశీలించారు.
NGKL: జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీసీసీఎఫ్ సువర్ణ పర్యటనలో భాగంగా ఫరాహాబాద్ వ్యూ పాయింట్ వద్ద పులి దర్శనమివ్వగా, మరొకటి గుండం వద్ద సేదతీరుతూ కనిపించింది. తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ పులుల సంఖ్య 40 దాటినట్లు తెలుస్తోంది. మెరుగైన సంరక్షణ చర్యల వల్ల పులులకు ఈ అడవి సురక్షిత నిలయంగా మారింది.
MDK: టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామంలోని గ్రామ దేవతలకు ఆదివారం రాత్రి గ్రామ ప్రజలు ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. 5 రోజులు సాగే గ్రామ దేవత జాతర ఉత్సవాలకు మొదటి రోజు గ్రామస్థుల సమక్షంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామ దేవత దుర్గమ్మ, పోచమ్మలకు బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
HYD: అత్తాపూర్ పరిధిలోని చింతల్మెట్లలో గంజాయి మత్తులో గ్యాంగ్ హింసకు దిగింది. ఓ యువకుడిపై కత్తితో దాడి చేయగా, అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మందలించిన స్థానికులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించి, ఓ ఇంటి తలుపునకు నిప్పంటించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
PDPL: పెద్దపల్లి కార్మిక అధికారిణి హేమలత తీరుపై భవన నిర్మాణ కార్మికులు ఆదివారం మంత్రి వివేక్ వెంకట స్వామికి ఫిర్యాదు చేశారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన అధికారిణి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చెన్నూర్లో కార్మిక, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి దళిత బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.