SRCL: రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా లో పదోతరగతిలో 3051 బాలురులు, 3717 బాలికలు మొత్తం 6768 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.