SRD: ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రూ.2.50 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. నేరడిగుంటలో ప్రాథమిక కేంద్రం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నేరవేరిందని పేర్కొన్నారు.
MDK: మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద వాహనాలను దొంగతనం చేస్తున్న వల్లేపు గోపాల్ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా మెదక్ పట్టణం చర్చ్ కాంపౌండ్లో 2 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. అనంతరం రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడుపై మెదక్, పెద్ద శంకరం పేట, కామారెడ్డి జిల్లాల్లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
BDK: రాములోరి గోత్రనామాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. భద్రాచలం రామయ్య కళ్యాణం సందర్భంగా తెరపైకి రాములు వారి గోత్రనామాల వివాదం బయటికి వచ్చింది. గోత్రనామాల వివాదం 2022 నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా, ఐదుగురు పండితులతో హైకోర్టు విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, రిపోర్టును ఆ కమిటీ దేవాదాయ శాఖకు సమర్పించింది.
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో సత్యమాంబ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండలాగు పోటీలు అలరించాయి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ యూనియన్ ఛైర్మన్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎద్దుల జతలు పాల్గొన్నాయి. విజేతలకు సాయంత్రం నగదు బహుమతులు, షీల్డ్స్ అందజేసి రైతులను అభినందించారు.
BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో దగాకోరు బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా విమర్శించారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు.
SDPT: భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి తరలించేందుకు సిద్ధం చేశారు. శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సమకూర్చిన తలంబ్రాలను ఆదివారం రామరాజుకు అందజేశారు. భక్తితో సమర్పించిన ఈ తలంబ్రాలు రామయ్య సేవలో భాగం కావడం అదృష్టమన్నారు.
SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ధర్మ టీచర్ యూనియన్ (DTU), TPTF సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నేతలు సంపతి రమేశ్, దూస సంతోశ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై మాట్లాడడం సరికాదన్నారు.
KMM: కామేపల్లి మండల పరిధిలోని పంచాయతీ వార్డు మెంబర్లకు ఈరోజు నుంచి ఈనెల 28 వరకు శిక్షణ తరగతులను కామేపల్లి రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రవీందర్, ఎంపీవో వీవీఎస్ శాస్త్రి తెలిపారు. 12 పంచాయతీలకు సంబంధించిన 114 మంది వార్డు మెంబర్లుకు తొలి విడతలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వార్డు మెంబర్లు సకాలంలో శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని బీజేపీ నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని బీజేపీ నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
PDPL: తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలోకి నెట్టిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, 6 గ్యారెంటీలకు నిధులు కోతపెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
KNR: హైదరాబాద్లో జరిగిన పద్మశాలి- 2026 ఉగాది పురస్కారాల్లో జమ్మికుంట మండలం ధర్మారానికి చెందిన కందికట్ల పద్మకు సేవా అవార్డు అందించారు. ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మహిళలకు టైలరింగ్ శిక్షణ, కాటన్ బ్యాగుల తయారీ, మహిళలకు ఉపాధి కల్పనలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.
NRPT: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇవాళ బీజేపీ చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని బీజేవైఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి బద్రి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.
SRPT: కోదాడ ప్రాంతీయ వైద్యశాలలో ఆదివారం శునకానికి విజయవంతంగా వెన్నెముక సర్జరీ నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా.పీ.పెంటయ్య మాట్లాడుతూ.. నందిగామకు చెందిన జంతు ప్రేమికుడు శామ్యూల్ పెంపుడు శునకానికి యాక్సిడెంట్లో గాయాలపాలవ్వగా యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చినట్లు వివరించారు.
WNP: ఆత్మకూరు పట్టణ శివారులో ఎస్సై జయన్న ఆధ్వర్యంలో ఆదివారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.