• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం

SRPT: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీగోదా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పీసీసీ సభ్యులు కొప్పుల వేణారెడ్డి దంపతులు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఘనంగా గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించి భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

January 13, 2025 / 12:17 PM IST

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఐలయ్య

BHNG: తెలుగు వారి పండుగ సంక్రాంతి సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి మీకు భోగభాగ్యాలను, సంక్రాంతి మీకు సుఖసంతోషాలను, కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని, మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంకున్నట్లు పేర్కొన్నారు.

January 13, 2025 / 12:01 PM IST

ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు: తలసాని

HYD: నిత్యం వివిధ కార్యక్రమాల్లో ఉండే మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవళ్లు, మనవరాళ్లతో ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గాలిపటాలను ఎగరేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

January 13, 2025 / 08:49 AM IST

కైట్ ఫెస్టివల్ను ప్రారంభించనున్న సీఎం

HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్‌ను సీఎం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మొత్తం 16 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ పాల్గొనబోతున్నారు. అదే విధంగా 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటారు.

January 13, 2025 / 08:29 AM IST

నేటి నుంచి కైట్ ఫెస్టివల్

HYD: నగరంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలకు 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు హాజరుకానున్నారు. దీంతో పాటు స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ‌, అంతర్జాతీయ స్వీట్లను, పిండి వంట‌ల‌ు ఇక్కడి స్టాళ్ల‌లో ప్రదర్శిస్తారని మంత్రి కృష్ణారావు తెలిపారు.

January 13, 2025 / 04:34 AM IST

హెచ్‌సీయూ ఏబీవీపీ నూతన కార్యవర్గం

HYD: హెచ్‌సీయూలోని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏబీవీపీ హెచ్‌సీయూ శాఖ ఇద్దరు పరిశోధక విద్యార్థులను అధ్యక్ష, కార్యదర్శులుగా నియమించారు. ఆదివారం ఏబీవీపీ జాతీయ సెంట్రల్ యూనివర్సిటీల విభాగం కన్వీనర్ బాలకృష్ణ వివరాలను తెలిపారు. అధ్యక్షుడుగా అనిల్ కుమార్, కార్యదర్శిగా ఆయుష్  మార్సింగ్‌లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

January 13, 2025 / 04:31 AM IST

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తు

HYD: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలి.

January 13, 2025 / 04:29 AM IST

మంత్రి కోమటిరెడ్డికి వినతి

NLG: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఆదివారం TGO జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర రోడ్‌లో భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

January 13, 2025 / 04:10 AM IST

మధిరలో సందడి చేసిన సినీ తారలు

KMM: మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ నందు ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు తెలుగు సినీ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీవీ ఛానల్ ఆర్టిస్టులు హాజరయ్యారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.

January 12, 2025 / 07:54 PM IST

ఏఐసీసీ కార్యదర్శి కలిసిన ఎంపీ మల్లు రవి

NGKL: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆదివారం నాగర్ కర్నూల్ ఎంపీ, రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై ఆమె ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

January 12, 2025 / 07:25 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

GDWL: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సుంకులమ్మమెట్టు సమీపంలో ఆదివారం సాయంత్రం గద్వాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపిన వివరాలు.. ఎలాంటి అనుమతిపత్రాలు లేకుండా గోనపాడు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మదిలేటి, యజమాని కర్రెప్పలపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

January 12, 2025 / 06:45 PM IST

శ్రీవారి సేవలో బిజ్వార్ గ్రామ మహిళలు

NRPT: తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బిజ్వార్ గ్రామానికి చెందిన మహిళలు 5 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ప్రతి రోజూ 6 గంటల పాటు శ్రీవారి సేవలో పాల్గొంటున్నామని, సేవకు అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సేవలో పద్మమ్మ, సునీత, వసుందర, జయమ్మ, సత్యమ్మ, నర్మదా, మమత, సుశీలమ్మ, సుజాత పాల్గొన్నారు.

January 12, 2025 / 06:23 PM IST

రేపటి సభను జయప్రదం చేయండి

KMM: రఘునాథపాలెం మండలం ముంచుకొండలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహిస్తున్న సభను జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కోరారు. ఖమ్మం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల హాజరవుతారని తెలిపారు.

January 12, 2025 / 04:43 PM IST

మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

KMM: అశ్వారావుపేట మండలంలో ఆర్ఎంపీ, పీఎంపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ 18వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. అనంతరం యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

January 12, 2025 / 04:09 PM IST

కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BDK: కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయ్యాలి అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల నూతనంగా ఎన్నికైన టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు పల్లెలే రామలక్ష్మయ్య, అశ్వారావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోదంపరుపు నాగకిషోర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జూపల్లి కోదండ వెంకట రామారావును ఎమ్మెల్యే సత్కరించారు.

January 12, 2025 / 03:56 PM IST