HNK: జిల్లా కేంద్రంలోని రామకృష్ణ కాలనీ సమీపంలో నేడు గుర్తు తెలియని వ్యక్తులు మహిళా మెడలో నుంచి బంగారు చైన్ అపహరించుకు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు కొండవీటి రాణి కిరాణం దుకాణం నిర్వహిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆటోలో దుకాణంలో సామాన్లు కొనుగోలు కోసం వచ్చినట్లుగా నటించి మెడలోని రెండున్నర తులాల బంగారపు గొలుసు తెంపుకొని పరారయ్యారు.